దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు
- October 26, 2021
దుబాయ్ : ఓ గ్రాసరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు ప్రవాసులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులపై అభియోగాలు రుజువుకావటంతో వారికి ఏడాది పాటు జైలుశిక్ష 1700 దిర్హామ్స్ ఫైన్ వేసింది. జైలుశిక్ష పూర్తైన తర్వాత దోషులందరినీ దేశం నుంచి తిరిగి పంపించేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే గతేడాది అక్టోబర్ లో ఓ గ్రాసరీ షాప్ లో ముగ్గురు ఏషియాకు చెందిన ప్రవాసులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓనర్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరికీ శిక్షపడింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల