దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు

- October 26, 2021 , by Maagulf
దొంగతనం కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు

దుబాయ్ :  ఓ గ్రాసరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు ప్రవాసులకు దుబాయ్ క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులపై అభియోగాలు రుజువుకావటంతో వారికి ఏడాది పాటు జైలుశిక్ష  1700 దిర్హామ్స్ ఫైన్ వేసింది. జైలుశిక్ష పూర్తైన తర్వాత దోషులందరినీ దేశం నుంచి తిరిగి పంపించేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే గతేడాది అక్టోబర్ లో ఓ గ్రాసరీ షాప్ లో  ముగ్గురు ఏషియాకు చెందిన ప్రవాసులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓనర్ పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరికీ శిక్షపడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com