బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్
- October 26, 2021
సౌదీ: దుబాయ్ డిప్యూటీ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హెచ్హెచ్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. బహ్రెయిన్ యువరాజు, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫాతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ (MGI) సమ్మిట్లో భాగంగా వారు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యం, భూమి క్షీణతను ఎదుర్కోవడానికి 50 బిలియన్ చెట్లను నాటాలని ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వనరుల స్థిరత్వాన్ని పెంచవచ్చని మక్తుమ్ అన్నారు. ఈ ఇనియేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించిన సౌదీ అరేబియాను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో నేచురల్ రిసోర్సెస్ పెంచటం, జీవన ప్రమాణ స్థాయి నాణ్యతను పెంచటానికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు.
తాజా వార్తలు
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!









