బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్
- October 26, 2021
సౌదీ: దుబాయ్ డిప్యూటీ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హెచ్హెచ్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. బహ్రెయిన్ యువరాజు, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫాతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ (MGI) సమ్మిట్లో భాగంగా వారు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యం, భూమి క్షీణతను ఎదుర్కోవడానికి 50 బిలియన్ చెట్లను నాటాలని ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వనరుల స్థిరత్వాన్ని పెంచవచ్చని మక్తుమ్ అన్నారు. ఈ ఇనియేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించిన సౌదీ అరేబియాను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో నేచురల్ రిసోర్సెస్ పెంచటం, జీవన ప్రమాణ స్థాయి నాణ్యతను పెంచటానికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!