బహ్రెయిన్ యువరాజును కలిసిన మక్తూమ్ బిన్ మహ్మద్
- October 26, 2021
సౌదీ: దుబాయ్ డిప్యూటీ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి హెచ్హెచ్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. బహ్రెయిన్ యువరాజు, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్-ఖలీఫాతో సమావేశమయ్యారు. సౌదీ అరేబియాలోని రియాద్లో మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ (MGI) సమ్మిట్లో భాగంగా వారు సమావేశమయ్యారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్యం, భూమి క్షీణతను ఎదుర్కోవడానికి 50 బిలియన్ చెట్లను నాటాలని ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వనరుల స్థిరత్వాన్ని పెంచవచ్చని మక్తుమ్ అన్నారు. ఈ ఇనియేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రతిపాదించిన సౌదీ అరేబియాను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశంలో నేచురల్ రిసోర్సెస్ పెంచటం, జీవన ప్రమాణ స్థాయి నాణ్యతను పెంచటానికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు.
తాజా వార్తలు
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...







