కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ప్రకటించిన యూఏఈ

- October 27, 2021 , by Maagulf
కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ప్రకటించిన యూఏఈ

యూఏఈ: కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ను యూఏఈ ప్రకటించింది. కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందినట్లయితే UAE దౌత్య కార్యకలాపాలు, రోగులు, మానవతావాద కేసులు, స్కాలర్‌షిప్‌లపై విదేశాలలో చదువుతున్న వారు కూడా ప్రయాణించవచ్చు. యూఏఈ వచ్చే ప్రయాణికులు కచ్చితంగా 48 గంటలలోపు నిర్వహించిన QR కోడ్‌తో ఉన్న COVID-19 PCR నెగిటివ్ సర్టిఫికేట్, ప్రయాణానికి 6 గంటల ముందు రాపిడ్ PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాలి. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాలి. అలాగే నాల్గవ, ఎనిమిదవ రోజులలో మరో రెండు PCR పరీక్షలు తీసుకోవాలి. టీకాలు తీసుకొని ప్రయాణికులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా PCR పరీక్ష చేయించుకోవాలి, 10 రోజులు క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే తొమ్మిదవ రోజున మరొక PCR పరీక్ష చేసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారు తమ ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ‘Tawajudi’ సర్వీస్ లో రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా ప్రయాణికులు ప్రోటోకాల్స్ వివరాలను, తమ అర్హతలను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com