కేవలం 392 దిర్హాములకే భారత్ ప్రయాణం
- October 27, 2021యూఏఈ-ఇండియా విమానాలు: యూఏఈ లోని అల్ ఐన్-కోజికోడ్ సర్వీసును 392 దిర్హామ్లతో పునఃప్రారంభించింది ఎయిరిండియా ఎక్స్ప్రెస్. వివరాల్లోకి వెళితే..
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చే నెల నుండి అబుదాబిలోని అల్ ఐన్ నుండి కేరళలోని కోజికోడ్ వరకు తన సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్లైన్ అబుదాబి కార్యాలయం తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ లో తీసుకున్న దేశవ్యాప్త ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 2020లో విమాన సర్వీసు నిలిపివేయబడింది. తిరిగి సర్వీసులను ప్రారంభిస్తుండటంతో, విమానయాన సంస్థ ప్రయాణికులకు Dh392 నుండి ప్రత్యేక టిక్కెట్ ధరను అందిస్తోంది.
మొదటి ఫ్లైట్ నవంబర్ 4 నుండి ప్రారంభమవుతుంది. వారానికి ఒక ఫ్లైట్ చొప్పున ప్రతి గురువారం ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. అనగా, మొదటి ఫ్లైట్ (IX 0335) కోజికోడ్ నుండి టేకాఫ్ అయ్యి మధ్యాహ్నం 12.25 గంటలకు అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అదే రోజు అల్ ఐన్ నుండి తిరుగు ప్రయాణం (IX 0336) మధ్యాహ్నం 1.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష