కేవలం 392 దిర్హాములకే భారత్ ప్రయాణం
- October 27, 2021యూఏఈ-ఇండియా విమానాలు: యూఏఈ లోని అల్ ఐన్-కోజికోడ్ సర్వీసును 392 దిర్హామ్లతో పునఃప్రారంభించింది ఎయిరిండియా ఎక్స్ప్రెస్. వివరాల్లోకి వెళితే..
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చే నెల నుండి అబుదాబిలోని అల్ ఐన్ నుండి కేరళలోని కోజికోడ్ వరకు తన సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు ఎయిర్లైన్ అబుదాబి కార్యాలయం తెలిపింది.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ లో తీసుకున్న దేశవ్యాప్త ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 2020లో విమాన సర్వీసు నిలిపివేయబడింది. తిరిగి సర్వీసులను ప్రారంభిస్తుండటంతో, విమానయాన సంస్థ ప్రయాణికులకు Dh392 నుండి ప్రత్యేక టిక్కెట్ ధరను అందిస్తోంది.
మొదటి ఫ్లైట్ నవంబర్ 4 నుండి ప్రారంభమవుతుంది. వారానికి ఒక ఫ్లైట్ చొప్పున ప్రతి గురువారం ఈ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. అనగా, మొదటి ఫ్లైట్ (IX 0335) కోజికోడ్ నుండి టేకాఫ్ అయ్యి మధ్యాహ్నం 12.25 గంటలకు అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అదే రోజు అల్ ఐన్ నుండి తిరుగు ప్రయాణం (IX 0336) మధ్యాహ్నం 1.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!