కోవాగ్జిన్కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్
- November 01, 2021న్యూఢిల్లీ : భారత్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది.
నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విజృంభించడంతో..కఠినమైన సరిహద్దు విధానాలను అవలంభించిన ఆస్ట్రేలియా 18 నెలల తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణీకులు అనుమతి లేకుండా ప్రయాణించవచ్చు. దేశంలోకి వచ్చే సమయంలో కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ' భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, చైనాలోని షినోఫార్మ్ అభివృద్ధి చేసిన బిబిఐబిపి-కోర్విని వ్యాక్సిన్లను ఆమోదిస్తున్నాం. కోవాగ్జిన్ తీసుకున్న 12 అంతకన్నా ఎక్కువ ఏళ్ల వయస్కులు, కోర్వి వ్యాక్సిన్ తీసుకున్న 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి దేశంలోకి అనుమతినిస్తున్నాం' అని ఆస్ట్రేలియా ప్రభుత్వం మీడియా ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ