కోవాగ్జిన్కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్
- November 01, 2021
న్యూఢిల్లీ : భారత్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది.
నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విజృంభించడంతో..కఠినమైన సరిహద్దు విధానాలను అవలంభించిన ఆస్ట్రేలియా 18 నెలల తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణీకులు అనుమతి లేకుండా ప్రయాణించవచ్చు. దేశంలోకి వచ్చే సమయంలో కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ' భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, చైనాలోని షినోఫార్మ్ అభివృద్ధి చేసిన బిబిఐబిపి-కోర్విని వ్యాక్సిన్లను ఆమోదిస్తున్నాం. కోవాగ్జిన్ తీసుకున్న 12 అంతకన్నా ఎక్కువ ఏళ్ల వయస్కులు, కోర్వి వ్యాక్సిన్ తీసుకున్న 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి దేశంలోకి అనుమతినిస్తున్నాం' అని ఆస్ట్రేలియా ప్రభుత్వం మీడియా ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







