కోవాగ్జిన్కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్
- November 01, 2021న్యూఢిల్లీ : భారత్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది.
నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విజృంభించడంతో..కఠినమైన సరిహద్దు విధానాలను అవలంభించిన ఆస్ట్రేలియా 18 నెలల తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణీకులు అనుమతి లేకుండా ప్రయాణించవచ్చు. దేశంలోకి వచ్చే సమయంలో కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ' భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, చైనాలోని షినోఫార్మ్ అభివృద్ధి చేసిన బిబిఐబిపి-కోర్విని వ్యాక్సిన్లను ఆమోదిస్తున్నాం. కోవాగ్జిన్ తీసుకున్న 12 అంతకన్నా ఎక్కువ ఏళ్ల వయస్కులు, కోర్వి వ్యాక్సిన్ తీసుకున్న 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి దేశంలోకి అనుమతినిస్తున్నాం' అని ఆస్ట్రేలియా ప్రభుత్వం మీడియా ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్