300 కి.మీ. స్పీడ్ తో కారు నడిపి సోషల్ మీడియాలో పోస్ట్..
- November 02, 2021
యూఏఈ: అబుధాబిలోని ఒక ప్రధాన రహదారి గుండా ఒక వ్యక్తి తన స్పోర్ట్స్ కారును గంటకు 300 కి.మీ వేగంతో డ్రైవ్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ఫాలోవర్లను పెంచుకోవాలనే అత్యాశతో ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో సదరు డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అబుదాబి న్యాయ శాఖ (ఏడీజేడీ) సోమవారం తెలిపింది. ఏడీజేడీ తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో కారు నడిపిన డ్రైవర్.. దాన్ని తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. రోడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోపాటు తన ప్రాణాలను, ఆ వీడియోను షేర్ చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడని యూఏఈ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. వైరల్ వీడియో క్లిప్ చూసిన అధికారులు సదరు డ్రైవర్ ని గుర్తించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వీడియోల కారణంగా ఇతర యువకులు కూడా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ లను చేసే ప్రమాదం ఉందని కార్యాలయం పేర్కొంది. షార్జా అంతర్గత రహదారిపై వేగంగా నడిపిన నలుగురు డ్రైవర్లను షార్జా పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







