కేరళ బ్యూటీ క్వీన్స్ దుర్మరణం
- November 02, 2021
కేరళలోని కోచిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. అందాల పోటీల్లో కిరీటాలు కైవసం చెసుకున్న ఇద్దరు సుందరీమణులు దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున అన్సీ కబీర్(25), డాక్టర్ అంజనా షాజన్, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ధాటికి కారు తుక్కుతుక్కయింది. హైవేలో వెళ్తుండగా స్కూటర్ను తప్పించబోయి కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అన్సీ, అంజనాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. మూడో వ్యక్తి, డ్రైవరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా.. తిరువనంతపురం జిల్లాలోని ఆలంకోడేకు చెందిన అన్సీ కబీర్.. 2019లో మిస్ కేరళ పోటీల విజేత.. 2021లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మోడల్, డాక్టర్ అంజనా షాజన్ 2019 మిస్ కేరళ అందాల పోటీల్లో రన్నర్పగా నిలిచారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









