Ashal పోర్టల్ ద్వారానే కొత్త వీసాల జారీ

- November 03, 2021 , by Maagulf
Ashal పోర్టల్ ద్వారానే కొత్త వీసాల జారీ

కువైట్: Ashal పోర్టల్ ద్వారానే కార్మికులకు కొత్త వీసాలు జారీ అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది. ఇందుకోసం ఆరు దశల ప్రక్రియను ప్రకటించింది. వీసా జారీ చేయాల్సిన వ్యక్తి తొలుత ఎలక్ట్రానిక్ పద్ధతిలో వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సమర్పించి ఆమోదం పొందాలి. దీంతో మొదటి దశ పూర్తవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఆమోదం పొందిన తర్వాతనే "ఆశల్" ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీసా అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది. వీసా జారీ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారానే పూర్తవుతుంది. వీసా ఫీ కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆపై కార్మిక శాఖ నుంచి వీసా కాపీని పొందేందుకు రిక్వెస్టును కూడా ఆశల్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com