ఆన్లైన్ లేదా ఆర్థిక మోసానికి బాధితులుగా మారకండి: యూఏఈ హెచ్చరిక
- November 03, 2021
యూఏఈ: రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలకు ఎందరో అమాయకులు బలైపోతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాం మీ వివరాలు ఇవ్వండి అని కస్టమర్లకు కాల్ చేసి వారి డబ్బుని దోచేస్తూ ఎందరికో తలనొప్పిగా మారారు ఈ జగత్కిలాడీలు. వీరి వలలో పడద్దు అని యూఏఈ అధికారులు పలు సూచనలు ఈ విధంగా తెలియజేసారు..
"మీ బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ వివరాలు చాలా గోప్యంగా ఉండాలి, ఈ వివరాలను ఇతరులతో పంచుకోవద్దు, ఇటీవల చాలా మంది బాధితులుగా మారారు.
మేము మీ బ్యాంక్ లేదా పోలీసుల నుండి కాల్ చేస్తున్నాము, మీ వివరాలు అప్డేట్ కావాలి లేకుంటే మీ ఖాతా లేదా కార్డ్ బ్లాక్ చేయబడుతుంది అని బెదిరిస్తున్నారు.
వాళ్ళు దయచేసి మీ గుర్తింపు మరియు బ్యాంకు కార్డ్ నంబర్ మరియు గడువు ( expiry ) ,one time password ( OTP) అని అడుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించవద్దు.
దురదృష్టవశాత్తూ మీరు ఈ కార్యకలాపానికి గురైనట్లయితే, వెంటనే బ్యాంక్కి కాల్ చేసి కార్డ్ బ్లాక్ మరియు బ్యాంక్ అభ్యర్థించినట్లయితే స్టాంప్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్తో స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి" అని యూఏఈ యంత్రాంగం ప్రజలు కోరింది.

--- వై.నవీన్, మాగల్ఫ్ ప్రతినిధి, యూఏఈ
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









