'భీమ్లా నాయక్' నుంచి దీపావళి గిఫ్ట్
- November 03, 2021
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అజ్ఞాతవాసి' తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అంతా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై మరో పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు మరోసారి పోస్టర్లో చూపించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'లాల భీమ్లా' వీడియో ప్రోమోను ఈ రోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కింద కూర్చోని.. పక్కనే పెద్ద బాటిల్ పెట్టుకొని ఏదో చూస్తున్నట్టు ఉన్న పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్తో పాటు రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







