ఘంటసాల గుడిని సందర్శించిన ఉగాండా వాసి బూరుగుపల్లి
- November 03, 2021
హైదరాబాద్ లో వంశీ - వేగేశ్న ఆశ్రమంలో నెలకొనివున్న సద్గురు ఘంటసాల గుడిని ఉగాండా కి చెందిన బూరుగుపల్లి వ్యాసకృష్ణ సందర్శించారు.ఘంటసాల వారికి జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రకాశం గావించారు .. వంశీ - వేగేశ్న వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు ,వంశీ మేనేజింగ్ ట్రస్టీ వేగేశ్న ఫౌండేషన్ చైర్ పర్సన్ శైలజ సుంకరపల్లి బూరుగుపల్లి వారిని ఘంటసాల జ్ఞాపికతో సత్కరించారు.. ఈ సందర్భంగా బూరుగు పల్లి వ్యాసకృష్ణ మాట్లాడుతూ వంశీ - వేగేశ్న దివ్యాంగుల వృద్ధుల సేవలు ప్రశంసనీయమని, వారు నిర్మించిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయం మరియు శిరిడి సాయి మందిరం ప్రశాంతతకు నిలయం అని ప్రశంసించారు.. రాబోయే ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతాభిమానులను ప్రభావితం చేయగలవు అని అన్నారు..
కరోనా మూలంగా 2020 నుంచి అంతర్జాలంలో 5 ఖండాల లోని కళా సంస్థలతో తెలుగు కళాకారులతో కలిసి వంశీ సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నదని సద్గురు ఘంటసాల శత జయంతి కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యమానంగా చేయబోతున్నామని కళా బ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు అన్నారు..
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









