టీ 20 ప్రపంచకప్లో అనుకోని విషాదం..
- November 08, 2021అబుధాబి: క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న టీ20 ప్రపంచకప్లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అబుధాబి వేదికగా ఆదివారం జరిగిన న్యూజిలాండ్- అఫ్గానిస్తాన్ మ్యాచ్కు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం ఉదయమే పిచ్ను పర్యవేక్షించి గ్రౌండ్ సిబ్బందికి సూచనలు అందజేసిన ఆయన ఆతర్వాత తన గదికి వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాత బయటకు రాలేదు. దీంతో అనుమానమొచ్చిన గ్రౌండ్ సిబ్బంది ఆయన గదికి వెళ్లి పరిశీలించగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు.
ఉత్తరాఖండ్కు చెందిన మోహన్ సింగ్ 2004లో దుబాయ్ కి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంతకుముందు పంజాబ్లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియం పిచ్ క్యూరేటర్ (ట్రైనీ)గా సేవలందించారు.దీంతో పాటు గ్రౌండ్ సూపర్ వైజర్, కోచ్, సహాయకుడి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అయితే భారత్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేసే న్యూజిలాండ్- అఫ్గానిస్తాన్ కీలకమైన మ్యాచ్ కు ముందు ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోహన్ సింగ్ గత కొంత కాలంగా మానసిక ఆందోళన, డిప్రెషన్తో బాధపడుతున్నారని వీటిని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని దుబాయ్ క్రికెట్ అధికారులు చెబుతున్నారు.అబుధాబి పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మోహన్ సింగ్ కుటుంబానికి ICC మరియు అబుధాబి క్రికెట్ తమ సంతాపాన్ని తెలియజేసాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం