Dh80 కే పీసీఆర్ టెస్టు
- November 10, 2021
దుబాయ్: ఇప్పుడు అతి తక్కువ ధరకే పీసీఆర్ టెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది 'రైట్ హెల్త్ గ్రూప్'. దుబాయ్లోని జాఫిలియా ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ అథారిటీ కార్ పార్కింగ్లో కార్మికులకు చౌకగా పిసిఆర్ పరీక్షలను అందించడానికి పెద్ద టెంట్ను ఏర్పాటు చేశారు.
కార్మికులు ఈ కేంద్రంలో పీసీఆర్ టెస్ట్ కొరకు Dh80 చెల్లించవలసి ఉంటుంది. క్లినిక్లు సాధారణంగా Dh150 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. అయితే, ఈ కేంద్రం వద్ద మాత్రం కార్మికులకు Dh80 వసూలు చేస్తారు.స్వదేశానికి ప్రయాణం కొరకు, హాలిడేస్ కొరకు, ఉద్యోగాలు మారడానికి లేదా వారి వీసా మార్చడానికి ముందు కోవిడ్-19 కోసం పరీక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ పధకం ప్రజలకు సులభతరం చేస్తుందని తక్కువ-ఆదాయ కార్మికుల కోసం చౌకైన వైద్య క్లినిక్లను నడుపుతున్న రైట్ హెల్త్ గ్రూప్ హెడ్ డాక్టర్ సంజయ్ పైతాంకర్ అన్నారు.

ప్రభుత్వ సర్వీసులు అయిన అబుదాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ అయిన SEHA చే నిర్వహించబడుతున్న ఆసుపత్రులలో దుబాయ్లో పీసీఆర్ పరీక్షలకు అతి తక్కువ ధర Dh50. "మా ఛార్జీ సాధారణ ప్రయివేట్ క్లినిక్ల కంటే తక్కువగా ఉంది కాబట్టి బర్ దుబాయ్, కరామా ప్రాంతాలలో ఉండే బ్యాచిలర్లు మరియు పరీక్షించాల్సిన కుటుంబాల నుండి ఆసక్తి ఉంటుంది" అని పైతాంకర్ అన్నారు.
ఈ కేంద్రం నవంబర్ 9న అధికారికంగా ప్రారంభించబడింది. ఇక్కడ రోజుకు 1,000 పిసిఆర్ పరీక్షలను నిర్వహించే సామర్ధ్యం ఉంది. ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ గేటు వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది మరియు ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలను ఉపయోగించే వేలాది మంది ప్రజలకు సేవలు అందిస్తుంది ఈ కేంద్రం.

దుబాయ్లోని జాఫిలియా ప్రాంతంలోనే కాకుండా అల్ క్వోజ్ మరియు జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో రెండు గుడారాలను కూడా నడుపుతోంది రైట్ హెల్త్ గ్రూప్.
తాజా వార్తలు
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!









