అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించిన తొలి ఖతార్ మహిళగా షేఖా అస్మా రికార్డు
- November 11, 2021
ఖతార్: ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ మరో ఘనత సాధించారు. అమా దబ్లామ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తొలి ఖతారీ మహిళగా షేఖా అస్మా రికార్డు సృష్టించారు. అమా దబ్లామ్ పర్వతంపై 6,812 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత షేఖా అస్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పర్వతారోహణకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టంగా, సంక్లిష్టంగా ఉందని షేఖా అస్మా ఆ పోస్టులో వెల్లడించారు. “అభినందనలు! ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ శిఖరాన్ని చేరుకున్నారు. ఇది ఈ సంవత్సరం మా ఛాంపియన్ ల ఫోర్త్ సమ్మిట్. ఆమె మౌంట్ అమాడబ్లామ్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఖతార్ మహిళగా నిలిచింది.’’ అని ఖతార్ జట్టు చేసిన ట్వీట్ లో ఆమే సాధించిన విజయాన్ని గర్వించదగ్గ విజయంగా అభివర్ణించింది. షేఖా అస్మా ప్రపంచంలోని ఏడవ ఎత్తైన పర్వతం మౌంట్ ధౌలగిరి, మౌంట్ మనస్లూను కూడా అధిరోహించింది. ఆక్సిజన్ లేకుండా 8000 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన మొదటి అరబ్గా ఆమె నిలిచింది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









