అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించిన తొలి ఖతార్ మహిళగా షేఖా అస్మా రికార్డు
- November 11, 2021
ఖతార్: ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ మరో ఘనత సాధించారు. అమా దబ్లామ్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తొలి ఖతారీ మహిళగా షేఖా అస్మా రికార్డు సృష్టించారు. అమా దబ్లామ్ పర్వతంపై 6,812 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత షేఖా అస్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పర్వతారోహణకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టంగా, సంక్లిష్టంగా ఉందని షేఖా అస్మా ఆ పోస్టులో వెల్లడించారు. “అభినందనలు! ఖతారీ పర్వతారోహకురాలు షేఖా అస్మా బింట్ థానీ అల్-థానీ 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ శిఖరాన్ని చేరుకున్నారు. ఇది ఈ సంవత్సరం మా ఛాంపియన్ ల ఫోర్త్ సమ్మిట్. ఆమె మౌంట్ అమాడబ్లామ్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఖతార్ మహిళగా నిలిచింది.’’ అని ఖతార్ జట్టు చేసిన ట్వీట్ లో ఆమే సాధించిన విజయాన్ని గర్వించదగ్గ విజయంగా అభివర్ణించింది. షేఖా అస్మా ప్రపంచంలోని ఏడవ ఎత్తైన పర్వతం మౌంట్ ధౌలగిరి, మౌంట్ మనస్లూను కూడా అధిరోహించింది. ఆక్సిజన్ లేకుండా 8000 మీటర్ల పర్వతాన్ని అధిరోహించిన మొదటి అరబ్గా ఆమె నిలిచింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









