"దృశ్యం-2" టీజర్..ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
- November 12, 2021విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం 'దృశ్యం 2'. ఆయన హిట్ చిత్రం 'దృశ్యం' సీక్వెల్, మలయాళ చిత్రం 'దృశ్యం 2' రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ చీకటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు వెంకీ మరో మాస్టర్ ప్లాన్ తో వచ్చాడని తెలుస్తోంది. టీజర్ గ్రిప్పింగ్ గా కనిపించదమే కాదు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఇదే టీజర్ తో సినిమా విడుదల గురించి చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించారు మేకర్స్. నవంబర్ 25న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ వంటి మొదటి భాగంలో నటించిన నటీనటులే 'దృశ్యం 2″లోనూ కనిపించనున్నారు. సంపత్ రాజ్, పూర్ణ సీక్వెల్లో కొత్త పాత్రలను పోషించారు. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్కు కూడా దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ