ఈనెల 15న తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
- November 13, 2021
ఈనెల 15 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకోనుంది. 16వ తేదీ నుంచి భక్తులకు అనుమతి ఇస్తన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు నెలల పాటు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.
మండల మకర విళక్కు పండుగ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతించనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 26న మండల పూజ ముగియనుంది. మకర విళక్కు కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తెరువనున్నారు.
వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుందని.. అదే నెల 20న ఆలయాన్ని మూసి వేస్తామని చెప్పారు. కరోనా నిబంధనలకు అనుణగుంగా భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. టీకా దృవపత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరని తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







