సంతకాల ఫోర్జరీ కేసు.. కోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన నిందితుడు

- November 14, 2021 , by Maagulf
సంతకాల ఫోర్జరీ కేసు.. కోర్టులో అప్పీల్ ఫైల్ చేసిన నిందితుడు

బహ్రెయిన్: సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనిషులను అక్రమంగా దేశంలోకి తెచ్చిన కేసులో 6 ఏండ్ల శిక్ష పడ్డ ఓ నిందితుడు బహ్రెయిన్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అతడి అప్పీల్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ప్రకారం.. నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి.. ఇద్దరు వ్యక్తులకు తెలియకుండా వార్ల పేర్ల మీద పనిమనిషులను తీసుకొచ్చాడు. దీని కోసం అతడు వారి సంతకాలను ఫోర్జరీ చేశాడు. ఈ విషయం వాళ్లకు తెలియడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి విచారించారు. ఇతరుల పేర్లతో అక్రమంగా పనిమనిషులను తెచ్చినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దీంతో ఇతరుల సంతకాలను ఫోర్జరీ చేసి పనిమనుషులను అక్రమంగా తీసుకొచ్చిన కేసుల్లో క్రిమినల్ కోర్టు ఆరేండ్ల జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com