ఎన్సీఏ చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్: గంగూలీ
- November 14, 2021
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్, సన్రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించాడు. ఇదివరకు ఎన్సీఏ హెడ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఇటీవల టీమ్ఇండియా కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆ బాధ్యతలు చేపట్టేందుకు తొలుత లక్ష్మణ్ నిరాకరించాడని వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు గంగూలీ, సెక్రెటరీ జైషా లక్ష్మణ్తో చర్చించి ఒప్పించారని తెలిసింది.
మరోవైపు ఇటీవల ద్రవిడ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తొలుత రాహుల్ సైతం టీమ్ఇండియా హెడ్కోచ్గా పనిచేయడానికి ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి. చివరికి గంగూలీ, షా పట్టుబట్టి ఒప్పించారని తెలిసింది. కాగా, ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన దిగ్గజాలు ఇప్పుడు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో అయినా టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో మరో టీ20 ప్రపంచకప్తో పాటు, టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!







