GCC మీటింగ్ కోసం బహ్రెయిన్ చేరుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్
- November 15, 2021
సౌదీ: GCC (గల్ఫ్ కో అపరేషన్ కౌన్సిల్) అంతర్గత వ్యవహారాల మంత్రుల 38వ సాధారణ సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ శనివారం బహ్రెయిన్ చేరుకున్నారు. అనంతరం బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో మనామాలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చలు జరిపారు. అంతకుముందు బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ కు ఘన స్వాగతం లభించింది. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు ప్రిన్స్ సుల్తాన్ బిన్ అహ్మద్, బహ్రెయిన్ రాజ్యంలో సౌదీ రాయబారి, బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







