"భారత్ మాతాకి జై" ఎందుకంటే: -
- March 21, 2016మనిషిని, గొడ్డుని వేరు చేసేది భావోద్వేగం. "భారత్ మాతా కి జై" అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం. పోరాట స్ఫూర్తి, ఐకమత్యం, సౌభ్రాతృత్వం అన్నీ భావోద్వేగాల్లోంచే వస్తాయి. అదే లేకపోతే స్వాతంత్రపోరాటమే లేదు. భావోద్వేగానికి లాజిక్ ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. "భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరసోదరీమణులు" అని స్కూల్లో చెప్పే ప్లెడ్జ్ లో కూడా లాజిక్ వెతికి "అందరూ సోదర సోదరీమణులు ఎలా అవుతారు? అర్థం లేకుండా!" అంటే అలా అన్నవాడిలో భావోద్వేగ నరం పనిచేయడం లేదని అర్థం. ఇంతకీ ఆ ప్లెడ్జ్ రాసింది ఒక తెలుగు వాడు. పేరు పైడిమర్రి వేంకట సుబ్బారావు. ఆయన తెలుగులో వ్రాస్తే అది దేశమంతా అన్ని భాషల్లోనూ చెప్తున్నారిపుడు. ఇలా తెలుగువాడు అని చెప్పుకోవడంలో కూడా భావోద్వేగం ఉంది. అదేదో సినిమా డయలాగ్ లాగ మూడు సింహాల చిహ్నం చూసినప్పుడల్లా నాకు ఇలా అనిపిస్తుంది.
"అశోక చిహ్నంలో
కనిపించని
నాలుగో సింహం-
భరతమాత వాహనం".
ఇలా అనుకోవడంలో కూడా నామటుకు నాకు భావోద్వేగం ఉంది.
-సిరాశ్రీ.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం