ఎంఎన్ సీ ఉద్యోగులకు మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలు
- November 17, 2021
దుబాయ్: మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలను 5 ఏళ్ల కాలానికి ఇష్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారు ఐదేళ్ల పాటు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ లో ఉండే అవకాశం ఉంటుంది. వారికి వీసా కూడా సులభంగా లభిస్తుంది. పని చేసుకునే వాతావారణం కల్పించటంతో పాటు విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా కంపెనీలకు కూడా తమ బిజినెస్ ను పెంచుకునేందుకు నాణ్యమైన మానవ వనరులను నియమించుకునేందుకు ఇది చక్కని అవకాశమని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ప్రపంచంలోనే పని వాతావారణం అద్భుతంగా ఉండే బెస్ట్ సిటీల్లో దుబాయ్ ను నంబర్ వన్ చేయటమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







