జనవరిలో 5-11 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్
- November 17, 2021ఖతార్: ఖతార్ లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఖతార్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేరెంట్స్ అంతా తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారితో పోల్చితే ఈ ఏజ్ గ్రూప్ లో వ్యాక్సిన్ చేయించుకొని వారి పై కరోనా ఎఫెక్ట్ ఉన్నట్లు చాలా స్టడీస్ లో తేలింది. వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్లో 63 శాతం మందికి మైనర్ కరోనా లక్షణాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లలపై ఉండకూడదంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 30 మైక్రో గ్రామ్స్ డోస్ ఉంటే పిల్లలకు మాత్రం 10 మైక్రో గ్రామ్స్ డోస్ ఇస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో వీరికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..ఇది పక్కా సేఫ్ అని అధికారులు స్పష్టం చేశారు. 1440 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చి రెండు నెలల పాటు అబ్జర్వేషన్ లో పెట్టామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం