ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ
- November 17, 2021టీమిండియా మాజీ క్రికెటర్, బిసిసిఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నియామకం అయ్యారు.
మంగళవారం దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశం లో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ పదవి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).
ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవికి సౌరవ్ను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని… ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు గంగూలీ అని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. ఈ పదవి కి సౌరవ్ గంగూలీ.. చాలా భాగా సెట్ అవుతాడని పేర్కొన్నారు. ఇక అటు బీసీసీఐ సభ్యులతో పాటు.. క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి