వీసీ ఆఫీస్ ధ్వంసం..
- March 22, 2016
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు నేడు క్యాంపస్కు తిరిగివచ్చారు. అప్పారావు వాహనంపై విద్యార్థి సంఘాలు దాడి చేశాయి. ఆయన కార్యాలయంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేసి, వసతి గృహం అద్దాలను పగులగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హెచ్సీయూలో పోలీసులు భారీగా మోహరించారు. అధ్యాపకులను గదిలో బంధించి బయట గడియ పెట్టారు. ఇక మీడియా ప్రతినిధులపై కూడా విద్యార్థులు దాడి చేశారు. వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించడంపై విద్యార్థులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.=అప్పారావుకు వ్యతిరేక, అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధ్యాపకులు కూడా రెండు వర్గాలు చీలిపోయినట్లు సమాచారం. వీసీ అప్పారావుకు ఏబీవీపీ విద్యార్థులు మద్దతిస్తున్నట్లు సమాచారం. రోహిత్ తో పాటు మరో నలుగురి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అప్పారావును వర్సిటీలోకి రానివ్వమని వ్యతిరేక వర్గం విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అప్పారావు వీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన చాంబర్ ను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







