ఇకపై స్టేట్ బ్యాంక్ లోన్స్ పొందడం ఈజీ
- November 18, 2021
భారత దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని ఇస్తుంది. వీటి వలన కస్టమర్స్ కి మంచిగా బెనిఫిట్స్ కలుగుతాయి. తాజాగా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
కో-లెండింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది స్టేట్ బ్యాంక్. యూగ్రో క్యాపిటల్ సంస్థ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అయితే దీనితో భాగంగా ఎంఎస్ఎంఈలకు సులభంగా లోన్స్ రానున్నాయి. ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా ఎస్బీఐ, యూ గ్రో 2022 మార్చి నాటికి రూ.500 కోట్ల రుణ మంజూరును లక్ష్యంగా భావిస్తున్నారు.
ఎస్బీఐ కో లెండింగ్ ఆపర్చునిటీస్ కోసం పలు ఎన్బీఎఫ్సీలతో పార్టనర్ షిప్ ని కుదుర్చుకుంటోంది. ఇది ఇలా ఉంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI సవరించిన కో-లెండింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసారు.
హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్/ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఆటో కాంపొనెంట్స్, లైట్ ఇంజినీరింగ్ మొదలైన 8 ఎస్ఎంఈ రంగాలకు స్టేట్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







