జలదిగ్భంధంలో తిరుపతి.. ఆలయంలోకి అనుమతి నిలిపివేసిన టీటీడీ
- November 18, 2021
తిరుమల: ఆద్యాత్మిక నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. స్థానిక మధురానగర్లో భారీగా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ప్రధాన రోడ్లలో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మరోవైపు తిరుమల కపిలతీర్థం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఆలయ పరిశరాల్లో భారీగా వరద ప్రవహిస్తుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులను ఆలయంలోకి అనుమతించకుండా చర్యలు చేపట్టారు. కపిలతీర్థంతో పాటు అక్ష్మీనారాయణ స్వామీ, వేణుగోపాలస్వామి ఆలయాల్లోకి కూడా భారీగా వరద చేరింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







