బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న భారత మహిళ

- November 19, 2021 , by Maagulf
బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న భారత మహిళ

కువైట్ : కువైట్ లో భారత్ కు చెందిన 65 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. కువైట్ లోని సాల్ మియా ప్రాంతంలోని ఎత్తైన ఓ బిల్డింగ్ నుంచి ఆమె దూకింది. స్పాట్ లో ఆ మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో ఆమె ఇండియన్ అని గుర్తించారు. చనిపోయిన మహిళ ఎవరన్నది గుర్తించాల్సి ఉంది. సంఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ అలర్టై ఆమెను హాస్పిటల్ కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే చనిపోయింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సూసైడ్ గా కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com