2017 నాటికి ట్రయల్ మరియు టెస్టింగ్: దోహా మెట్రో రైల్
- March 22, 2016
దోహా మెట్రో రైల్కి సంబంధించి ట్రయల్, టెస్టింగ్ 2017 చివరి నాటికి జరగవచ్చని ఖతార్ రైల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మెట్రో రైల్ కోచ్లు దిగుమతయ్యే అవకాశం ఉందని ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సబాయి చెప్పారు. 40 స్టేషన్లతో 108 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్ని 2019 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్తరన్ సెక్షన్లోని 42 కిలోమీటర్ల మేర లాంగ్ రెడ్ లైన్ టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యిందనీ, వీలైనంత వేగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ పనుల్ని చేపడ్తామని అన్నారు. మొత్తం కాంట్రాక్టుల్లో 70 శాతం లోకల్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దోహా మెట్రో ప్రాజెక్ట్ కోసం 21 టన్నెల్ బోరింగ్ మెషీన్లను వినియోగిస్తుండడం గిన్నీ వరల్డ్ రికార్డ్గా అధికారులు అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









