దుబాయ్ ఎక్స్ పో- 2020 కి అనుహ్య స్పందన...

- November 23, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో- 2020 కి అనుహ్య స్పందన...

దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో 2020 కి ఊహించిన దాని కన్నా ఎక్కువ స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల సంప్రదాయాలను, సంస్కృతులను ఒక్క దగ్గరికి చేర్చిన ఈ ఎక్స్ పో ను చూసేందుకు అన్ని దేశాల విజిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శిస్తున్నారు. 51 రోజుల్లోనే ఏకంగా 4 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శించటం విశేషం. ఈ వీకెండ్ లో ఎక్స్ పో లో పలు స్పోర్ట్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ఉండటం తో పాటు వీకెండ్ పాస్ ను 45 దిర్హామ్స్ కే అందజేశారు. దీంతో ఏకంగా 1,20,000 మంది ఈ వీకెండ్ విజిటర్స్ పాస్ ను తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఎక్స్ పో కొనసాగనుంది. అప్పటి వరకు కనీసం 2 కోట్ల మంది విజిట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com