సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు

- November 23, 2021 , by Maagulf
సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు

సౌదీ: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ, రియాద్‌లో ‘విమెన్ ఇన్ సౌదీ సెక్యూరిటీ ఫోరం’ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 2 వరకు ఈ ఫోరం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మహిళా సాధికారత పెంపు కోసం ఈ ఫోరం నిర్వహిస్తారు. విద్యా రంగంలో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించి, తద్వారా వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళల పాత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు ఈ ఫోరంలో వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com