ఏపీ కరోనా అప్డేట్

- November 23, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విడుదల చేసిన హెల్త్‌ బులి టెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 119 శాంపిల్స్‌ పరీక్షించగా.. 196 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 242 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,02, 23, 680 కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,71, 567 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,54, 979 కు చేరుకుంది.. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,429 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2159 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com