ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన కవిత

- November 23, 2021 , by Maagulf
ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన కవిత

నిజామాబాద్: నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటరాగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు వెళ్లిన కవిత... ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అంతకుముందు ర్యాలీగా కవిత... నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు వచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అయిన ఆమెకే మరోసారి కేసీఆర్‌ అవకాశం కల్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com