కోవాగ్జిన్ తీసుకొని తిరిగి కువైట్ కు రాలేకపోతున్న ఇండియన్స్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్
- November 24, 2021
కువైట్:కువైట్ రావాలనుకుంటున్న ఇండియన్స్ కోసం భారత ఎంబసీ కొత్తగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. కువైట్ కు రావాల్సి వారు కచ్చితంగా కువైట్ అనుమతించిన వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది. ఐతే కరోనా పీక్ లో ఉన్న టైమ్ లో కువైట్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ తిరిగి భారత్ కు వెళ్లిపోయారు. వారిలో కొంతమంది కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా కోవాగ్జిన్ తీసుకున్నారు. ఐతే కువైట్ కోవాగ్జిన్ టీకా ను అనుమతించలేదు. దీంతో మళ్లీ కువైట్ కు రావాలనుకుంటున్న ఇండియన్స్ కు ఇబ్బందిగా మారింది. ఈ విషయం భారత ఎంబసీ దృష్టికి వెళ్లటంతో సమస్య ను తీర్చటం పై భారత ఎంబసీ ఫోకస్ చేసింది. ఎవరైతే కోవాగ్జిన్ తీసుకున్నారో వారికోసం కొత్తగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను స్టార్ట్ చేసింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇన్ఫర్మేషన్ ను భారత ఎంబసీ తెలియజేస్తుంది. కువైట్ అధికారులతో ఈ సమస్య పై ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భారత ఎంబసీ అధికారులు కోరారు. ఆన్ లైన్ లో http://forms.gle/ce3b9ETGJAeTJZku9 ఈ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









