‘బార్డర్ ఎంట్రీ’ కొత్త ప్రోటోకాల్ అమల్లోకి
- November 24, 2021
యూఏఈ: UAE పొరుగు దేశాల సిటిజన్స్, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తూ... పదే పదే దేశంలోకి వచ్చిపోయే వారి కోసం బార్డర్ ఎంట్రీ ప్రోటోకాల్ ని యూఏఈ అథారిటీ అప్డేడ్ చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. GCC పౌరులందరూ ఆమోదించబడిన వ్యాక్సిన్లు, బూస్టర్ పూర్తి మోతాదులను తీసుకోవాలి. టీకాలు పొందిన విదేశీయులు సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి 14 రోజుల ముందు నాటి PCR టెస్ట్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలి. ఎవరైనా వరుసగా ఆరు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు యూఏఈలో ఉన్నట్లయితే, వారు వచ్చిన ఆరవ రోజున కూడా PCR పరీక్ష చేయించుకోవాలి. ఇక టీకాలు వేయని వారి విషయానికొస్తే.. వారు వచ్చే తేదీకి 72 గంటల కంటే ముందుగా చేయించుకున్న నెగిటివ్ PCR పరీక్ష రిపోర్టును సమర్పించాలి. నాలుగు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు UAEలో ఉండేవారు తప్పనిసరిగా వచ్చిన నాల్గవ రోజున, ఎనిమిదవ రోజున PCR పరీక్షను చేయించుకోవాలి. అటు టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యా సిబ్బందికి, విద్యార్థులు, విద్యా సంస్థల నుండి వారిని పికప్ చేసే విద్యార్థుల తల్లిదండ్రులకు PCR పరీక్ష ఫలితాల చెల్లుబాటు గడువును 14 రోజులకు పొడిగించారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం