‘బార్డర్ ఎంట్రీ’ కొత్త ప్రోటోకాల్ అమల్లోకి
- November 24, 2021
యూఏఈ: UAE పొరుగు దేశాల సిటిజన్స్, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తూ... పదే పదే దేశంలోకి వచ్చిపోయే వారి కోసం బార్డర్ ఎంట్రీ ప్రోటోకాల్ ని యూఏఈ అథారిటీ అప్డేడ్ చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. GCC పౌరులందరూ ఆమోదించబడిన వ్యాక్సిన్లు, బూస్టర్ పూర్తి మోతాదులను తీసుకోవాలి. టీకాలు పొందిన విదేశీయులు సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి 14 రోజుల ముందు నాటి PCR టెస్ట్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలి. ఎవరైనా వరుసగా ఆరు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు యూఏఈలో ఉన్నట్లయితే, వారు వచ్చిన ఆరవ రోజున కూడా PCR పరీక్ష చేయించుకోవాలి. ఇక టీకాలు వేయని వారి విషయానికొస్తే.. వారు వచ్చే తేదీకి 72 గంటల కంటే ముందుగా చేయించుకున్న నెగిటివ్ PCR పరీక్ష రిపోర్టును సమర్పించాలి. నాలుగు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు UAEలో ఉండేవారు తప్పనిసరిగా వచ్చిన నాల్గవ రోజున, ఎనిమిదవ రోజున PCR పరీక్షను చేయించుకోవాలి. అటు టీకాలు వేసిన, టీకాలు వేయని విద్యా సిబ్బందికి, విద్యార్థులు, విద్యా సంస్థల నుండి వారిని పికప్ చేసే విద్యార్థుల తల్లిదండ్రులకు PCR పరీక్ష ఫలితాల చెల్లుబాటు గడువును 14 రోజులకు పొడిగించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







