హోలీ పండుగ
- March 22, 2016
ఈ పండుగను కామదేవోత్సవమని, హోలికోత్సవమని, డోలికోత్సవమని, వసంతోత్సవమని మనదేశంలో నాలుగువిధాలుగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను వసంతోత్సవం పేరుతో విదేశాలైన గల్ఫ్,అమెరికా, జర్మనీ, పర్షియా ఈజిప్టు, గ్రీసు మొదలైన దేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఈ కాలం నాటిది కాదీ పండుగ: హోలీ పండుగ కృతయుగంలోనే పుట్టింది. పూర్వం రఘునాథుడనే రాజు జనరంజకంగా ప్రజలను పాలించేవాడు. కొంతకాలానికి అతని రాజ్యంలోని పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని, దాని బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు రాజుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు సభలో ఉన్న నారద మహాముని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజిస్తే పసిపిల్లలకు ఏ బాధలూ ఉండవని చెప్పాడు. దాంతో రాజు పై విధంగా పూజలు జరపమని ఆజ్ఞాపించడంతో ఆనాటి నుంచి ఈ ఉత్సవం జరుపుకుంటున్నారని ప్రతీతి. ఆ కాలంలో ఈ పండుగ రోజు రాత్రి సమయంలో పసిపిల్లలను ఇంట్లో దాచి ఉంచేవారని తెలుస్తుంది.
హోలిక గురించి మరో కథ కూడా ఉంది. హోలిక హిరణ్యకశిపుని సోదరి. అగ్ని ఆమెను దహించదని వరం. ఆ వరాన్ని ఉపయోగించి, ప్రహ్లాదుని సంహరించ దలచాడు హిరణ్యకశిపుడు. అన్నగారి ఆజ్ఞమేరకు హోలిక ఆ పసివాణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశించింది. అయితే ఆ మంటల్లో హోలికయే అగ్నికి ఆహుతి కాగా, ప్రహ్లాదుదు మాత్రం చిరునవ్వుతో వెలుపలికి వచ్చాడు. అప్పుడు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు జల్లుకున్నారని కథనం.
కామదేవోత్సవం: దక్షయజ్ఞం సమయంలో అవమానానికి గురైన సతీదేవి ప్రాణత్యాగం చేయడంతో శివుడు విరాగియై హిమవత్ పర్వతాన తపస్సు చేయసాగాడు. లోక కల్యాణం కోసం పార్వతియై పుట్టిన సతీదేవిపై శంకరునికి ప్రేమ కలిగించేందుకు ఇంద్రాది దేవతలు ఆలోచించి మన్మథుని పిలిచి విషయం వివరించారు. వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవి, మిత్రుడు వసంతునితో కలిసి హిమవత్పర్వతాన్ని చేరాడు. పార్వతీదేవి ఈశ్వరునికి సపర్యలు చేస్తున్న సమయంలో శివునిపై మన్మథుడు తన పుష్పబాణాలు ఉపయోగించి ఆయన మనస్సును వికలం చేశాడు. దాంతో శివుడు కోపించి, మూడోకన్ను తెరిచి అతన్ని మసి చేశాడు. ఈ విధంగా మన్మథుణ్ణి శివుడు దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ గా కాముని పున్నంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణమి రోజు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









