సోమాలియాలో భారీ పేలుడు
- November 25, 2021మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది.ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్ బాంబర్ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్ అడెన్ హసన్ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్ సమీపంలో పేలుడు జరిగిందని, అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కె4 జంక్షన్ సమీపంలోనే ముకస్సర్ ప్రాథమిక, సెకండరీ పాఠశాల, ఆస్పత్రి ఉన్నాయని అన్నారు. పేలుడు దాటికి పాఠశాల, ఆస్పత్రి కూలిపోయాయని, వివరాలు తెలియదని అన్నారు. అలాగే ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి సిబ్బందిలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు… అనే అంశంపై స్పష్టత లేదని, స్పందించేందుకు యుఎన్ అధికారులు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అల్-షబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..