ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కార్మికులకు బూస్టర్ డోసులపై అవగాహన కార్యక్రమాలు
- November 29, 2021
బహ్రెయిన్: ప్రపంచవ్యాప్తంగా COVID-19 కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బహ్రెయిన్ లేబర్ డిపార్ట్మెంట్, సోషల్ డేవలప్మెంట్ మినిస్ట్రీ అలెర్ట్ అయ్యాయి. లేబర్ క్యాంపుల వద్ద కరోనావైరస్ నివారణ ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేశాయి. దీంతో పాటు వివిధ వైరస్ వేరియంట్ల నుంచి రక్షణకు కార్మికులు వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నాయి. మొదటి దశ ప్రచారంలో భాగంగా 27,340 ట్రేడింగ్ అవుట్లెట్లు, 8,277 పారిశ్రామిక సంస్థలు, 6,695 నిర్మాణ సంస్థలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని, వర్క్సైట్లు, లేబర్ క్యాంపుల వద్ద అన్ని ముందస్తు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని లేబర్ మినిస్ట్రీ కోరింది. ఈ మేరకు ఇన్స్పెక్షన్ అండ్ ప్రొఫెషనల్ సేఫ్టీ డైరెక్టరేట్ వర్క్సైట్లు, లేబర్ క్యాంపుల వద్ద పాటించాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ తెలిపే వివిధ భాషల్లోముద్రించిన ప్రచార పోస్టర్లను పంపిణీ చేస్తోంది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









