బుర్జ్ ఖలీఫా మీద ఆర్జీవీ ట్రైలర్
- November 28, 2021దుబాయ్:ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లడ్కీ- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా ట్రైలర్ నేడు బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శింపబడింది.ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ కట్టడం మీద ప్రదర్శింపబడిన తొలి హిందీ చిత్రం ట్రైలర్ ఇదే కావడం గమనార్హం.
దర్శకుడు రాం గోపాల్ వర్మ,చిత్ర కథానాయిక పూజా నేడు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
"ఇంత గొప్ప మానవ నిర్మితమైన బుర్జ్ ఖలీఫా మీద నా చిత్రం ట్రైలర్ ప్రదర్శింపబడడం గర్వంగా ఉంది.ఇది బ్రూసిలీకి దక్కిన సరైన గౌరవం అని నేను అనుకుంటున్నాను" అని రాం గోపాల్ వర్మ అన్నారు.
బ్రూస్లీ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విశేషమైన ప్రచారం జరుపుకుంది.చైనీస్ ఉపశీర్షికలతో (సబ్టైటిల్స్) ఈ చిత్రం చైనాలో ఏకంగా 30,000 థియేటర్ల లో విడుదలవుతోంది. చైనాలో అత్యధిక సినిమా హాల్స్ లో విడుదలవుతున్న తొలి భారతీయ
చిత్రంగా అరుదైన గౌరవాన్ని కూడా ఈ చిత్రం పొందుతోంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ