ప్రవాసులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ..
- November 30, 2021కువైట్: వలసదారులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీపై కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇకపై వలసదారులు ప్రతియేటా 130 కువైటీ దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రెండేళ్లకు ఒకసారి 20 కేడీలు పెంచడం జరుగుతుంది. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతి మనిషికి 190 కువైటీ దినార్ల కు ఫ్రీజ్ చేస్తారు. ఈ మేరకు హెల్త్ అస్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ(ధామన్) సీఈఓ థామర్ అరబ్ వెల్లడించారు. ఈ కొత్త ధామన్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి రెసిడెంట్కు తప్పనిసరి అని ఈ సందర్భంగా థామర్ అరబ్ వెల్లడించారు. ఈ పాలసీలో రెసిడెంట్కు కావాల్సిన ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అన్ని అవసరాలను కవర్ చేయడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అందించే వైద్య సలహా, డయాగ్నసిస్, చికిత్స, మందులు ఇలా ప్రతిది ఇందులో ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఆరోగ్యశాఖ నివాసితులకు అందిస్తున్న 50 కేడీల తప్పనిసరి ఇన్సూరెన్స్ పాలసీ స్థానంలో ఈ కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా