తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై అర్ధరాత్రి నుంచి ఆంక్షలు
- November 30, 2021
హైదరాబాద్: ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు.వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు.రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి పాజిటివ్గా నిర్ధారణ అయితే గచ్చిబౌలి టీమ్స్కు తరలించనున్నట్టు తెలిపారు.
ఇప్పటి వరకు దేశంలో,రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించలేదని అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన చర్యలు అటు కేంద్ర, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రతిచోట థర్మల్ స్క్రీనింగ్లు చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







