ఒమిక్రాన్ అలర్ట్: అర్థరాత్రి నుంచి కొత్తరూల్స్...
- November 30, 2021న్యూ ఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది.దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది.దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు.ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది.జపాన్లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది.కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్ను తీసుకొచ్చింది.రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్పోర్ట్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు.ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్పోర్ట్లోనే వేచి ఉండాలి. నెగిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్లో ఉండాలి.
ఏడు రోజుల హోమ్ క్వారంటైన్ తరువాత 8వ రోజు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలి.అప్పుడు కూడా నెగిటివ్ వస్తే బయటకు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.ఇక ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్గా తేలితే వారిని సపరేట్గా క్వారంటైన్కు తరలిస్తారు. వారి శాంపిల్స్ను INSACOG ల్యాబ్ కు పంపి జీనోమ్ స్వీక్వెన్సింగ్ చేయిస్తారు.ఒకవేళ అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలితే వారిని సాధారణ కరోనా చికిత్సను అందిస్తారు.అదే ఒమిక్రాన్ పాజిటివ్గా తేలితే ప్రత్యేకమైన చికిత్సను అందిస్తారు. యూకేతో పాటు అధిక రిస్క్ ఉన్న 44 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు దృష్టి సారించారు.కేంద్రం విడుదల చేసిన కొత్త రూల్స్ ఈ అర్ధరాత్రి నుంచి అమలులోకి రాబోతున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు