ప్రధాని భగత్‌సింగ్‌కు నివాళులర్పించారు

- March 23, 2016 , by Maagulf
ప్రధాని భగత్‌సింగ్‌కు నివాళులర్పించారు

స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారిని ఉరితీసిన రోజు(మార్చి 23)ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రముఖ సోషలిస్ట్‌ నేత డాక్టర్‌ రామ్‌మనోహర్‌ లోహియా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోహియా గాంధీకి రాసిన ఓ లేఖను ట్విట్టర్‌లో ఉంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com