కువైట్ లో అవినీతి నిర్మూలనకు మరిన్ని చర్యలు...
- December 08, 2021
కువైట్: దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ను మరింత బలోపేతం చేయనుంది. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా చైర్మన్, అబ్దుల్ అజీజ్ అల్-ఇబ్రహీం తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా UN కన్వెన్షన్, అరబ్ అవినీతి వ్యతిరేక సదస్సులో కువైట్ చేరడంతోనే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. పాలస్తీనా అవినీతి నిరోధక అథారిటీ మూడవ అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి చట్టాల రూపకల్పనకు నజాహా కృషి చేసిందన్నారు. ఆడిటింగ్ మోసాలు, పబ్లిక్ టెండర్లలో మోసాలను కనిపెట్టేందుకు సెంట్రల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతోపాటు పాలనలో పారదర్శకతకు నజాహా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థిరమైన అభివృద్ధి 2030 లక్ష్యాలను సాధించే ప్రయత్నాలలో నజాహా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు