కొత్త కోవిడ్ కిట్...30 నిమిషాల్లోనే రిసల్ట్
- December 08, 2021
పూణే: కరోనా కొత్త వేరియంట్ భయం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నది.వివిధ దేశాల నుంచి ప్రయాణికులు భారత్కు వస్తున్నారు.అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడానికి, రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతున్నది.దీంతో విమానాశ్రయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.రద్దీ పెరిగిపోవడంతో విమానాశ్రమాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారే అవకాశం ఉంది.దీంతో రద్దీని తగ్గించేందుకు వేగంగా కరోనా ఫలితాలు వచ్చేందుకు అవసరమైన కిట్ల తయారీపై ఐసీఎంఆర్,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దృష్టి సారించింది.
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆర్టీ ల్యాంప్ పేరుతో కోవిడ్ కిట్ను సిద్దం చేసింది.ఈ కిట్తో పరీక్షలు నిర్వహిస్తే అరగంటలోనే ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.ఈ ఆర్టీల్యాంప్ కిట్తో వందశాతం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని, పైగా ఖర్చు సైతం 40 శాతం వరకు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.మరో రెండు వారాల్లో కొత్త కిట్లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









