ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- April 02, 2026
కువైట్: సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం మీదుగా భారత్ కు తన విమాన సర్వీసులను ఏప్రిల్ 5 నుండి పునఃప్రారంభిస్తున్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కనెక్టివిటీని విస్తరించడం మరియు పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ను తీర్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ను ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు కొచ్చిలతో కొత్త సర్వీసులు కలుపుతాయని ఎయిర్లైన్ తాత్కాలిక సీఈఓ అబ్దుల్వహాబ్ అల్-షట్టి తెలిపారు.
ఏప్రిల్ 5వ తేదీ నుండి అహ్మదాబాద్కు రానుపోను విమాన సర్వీసులు వారానికి ఒకసారి ఆదివారాల్లో ప్రారంభమవుతాయని అల్-షట్టి తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి కొచ్చికి వారానికి రెండుసార్లు సోమవారాలు, బుధవారాల్లో సర్వీసులు నడుస్తాయి. కాగా, ఏప్రిల్ 7వ తేదీ నుండి ఢిల్లీ విమానాలు వారానికి ఒకసారి మంగళవారాల్లో నడుస్తాయి. ఏప్రిల్ 10వ తేదీ నుండి ముంబై విమానాలు వారానికి ఒకసారి శుక్రవారాల్లో ప్రారంభమవుతాయి.
ఈ సంస్థ ఇటీవలే దమ్మామ్ మీదుగా లండన్, కైరో, ఇస్తాంబుల్, లాహోర్ మరియు అమ్మాన్తో సహా పలు అంతర్జాతీయ నగరాలకు సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్లైన్ అందుబాటులో ఉన్న కీలక గమ్యస్థానాలకు సేవలను అందిస్తూనే, పెరిగిన బుకింగ్ అభ్యర్థనలను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత ఎయిర్లైన్కు అత్యంత ప్రాధాన్యత అని పునరుద్ఘాటించారు.
అదే విధంగా అల్ ఖైరాన్ మాల్ సహకారంతో కువైట్ ఎయిర్వేస్ ప్రత్యేకమైన షాపింగ్ డీల్స్ను అందిస్తుంది. దీని ద్వారా ప్రయాణీకులు బయలుదేరే ముందు ఎంపిక చేసిన బ్రాండ్లపై ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









