దుబాయ్ స్కూళ్ళు ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మూసివేత

- December 08, 2021 , by Maagulf
దుబాయ్ స్కూళ్ళు ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే మూసివేత

దుబాయ్: దుబాయ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్, స్కూల్ ప్రిన్సిపాళ్ళకు వీకెండ్ విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి ప్రతి శుక్రవారం స్కూళ్ళు మధ్యాహ్నం 12 గంటలకే మూసివేయాల్సి వుంటుంది. ఈ మేరకు నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూఏఈలో నాలుగున్నర రోజులు మాత్రమే పని దినాలు వుండేలా కొత్త నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దానికి అనుగుణంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇకపై సోమవారం నుంచి తెరచుకుంటాయి, శుక్రవారం వరకు పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు దినాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com