విజయవాడ చేరుకున్న ఏపీ గవర్నర్
- December 09, 2021
అమరావతి: కరోనా తదనంతర సమస్యలతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ లు గురువారం రాత్రి విజయవాడ చేరుకున్నారు.కరోనా నుండి కోలుకున్నప్పటికీ తరువాత ఆరోగ్య పరంగా స్వల్ప సమస్యలు ఎదురు కావటంతో వీరిని ప్రత్యేక విమానంలో ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజి) హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం దంపతులు ఇరువురు పూర్తిగా కోలుకున్నారు.ఈ నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, బబితా దంపతులు హైదరాబాద్ ఏఐజి ఆసుప్రతికి వెళ్లి హరిచందన్ దంపతులను పరామర్శించి యోగ క్షేమాలు తెలుసు కున్నారు. గవర్నర్ కు వైద్య సేవలు అందిస్తున్న ప్రత్యేక బృందంతో సమావేశమైన సిసోడియా, భవిష్యత్తులో ఆరోగ్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి విచారించారు.డిశ్చార్జికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, తదితరులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తాను అన్ని విధాల పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు.ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ప్రభుత్వ సూచనల మేరకు వ్యవహరించాలని ముఖ ముసుగు ధరించటం,చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం తప్పనిసరన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







